Dailyhunt
ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్; పైలట్, కో-పైలట్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్; పైలట్, కో-పైలట్ మృతి

వార్త 6 days ago

త్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం ఒక చార్టర్డ్ విమానం ఆరా కొండను ఢీకొన్నట్లు సమాచారం. దీంతో భారీ అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌ఎస్‌పి లాల్ ఉమ్మేద్ సింగ్‌తో సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తుండగా, ప్రమాద స్థలం నుండి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు కొండపైన కూలిపోయిన జెట్ నుండి దట్టమైన పొగ, మంటలు వెలువడుతున్నట్లు ఘటనా స్థలం నుండి వచ్చిన చిత్రాలలో కనిపించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జపాన్‌లో భారీ భూకంపం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha