Chennai Fire Accident: చెన్నైలోని ఐటీ కారిడార్లో ఉన్న టెక్ మహీంద్రా గోదాము అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Read also: Medical shops strike: మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్!
Chennai Fire Accident: వంద ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే అక్కడికి చేరుకుంది. మంటలను అదుపు చేయడానికి సుమారు వంద ఫైర్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర ఐటీ ఆఫీసులను కూడా అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.
ఘటనపై అధికారుల ఆంక్షలు – దర్యాప్తు
అగ్నిప్రమాదం జరగడానికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు, ఫైర్ విభాగం అధికారులు ప్రస్తుతం మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలు కూలుస్తున్న కొత్త సర్కార్

