Dailyhunt
దారుణం.. వృద్ధుడికి మూత్రం తాగించిన కేసులో ఇద్దరు అరెస్ట్.. అసలేం జరిగింది?

దారుణం.. వృద్ధుడికి మూత్రం తాగించిన కేసులో ఇద్దరు అరెస్ట్.. అసలేం జరిగింది?

వార్త 1 week ago

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో మనసు కలిచివేసే ఘటన జరిగింది. ఒక యువ జంట మార్చి 5న ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది.

దీనిని అవమానంగా భావించిన యువతి కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ఎలాగైనా ఆ యువకుడి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూశారు. చివరికి ఆ అబ్బాయి తండ్రి అయిన 70 ఏళ్ల వృద్ధుడిని టార్గెట్ చేసి కిడ్నాప్ చేశారు.

Read also: RTC Driver Ravinder: భూపాలపల్లి ఆర్‌టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

 Elderly man harassment case in MP

Madhya Pradesh Crime: అమానుషంగా మూత్రం తాగించారు

కిడ్నాప్ చేసిన వృద్ధుడిని నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హింసించారు. అంతటితో ఆగకుండా, మద్యం సీసాలో మూత్రం నింపి ఆయనతో బలవంతంగా తాగించారు. ఈ హేయమైన చర్యను వారంతా కలిసి వీడియో తీశారు. వృద్ధుడని కూడా చూడకుండా వారు చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మార్చిలో జరిగినా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ వివాహమే శాపమైంది

బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని అందరూ కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చెల్లెలి ప్రేమ.. అన్నల పగ! పొలంలో ఆ రాత్రి ఏం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha