DK Shivakumar : భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదికల ఆధారంగా ఒక ఆసక్తికరమైన గణాంకం వెలుగులోకి వచ్చింది.
దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా (Richest Chief Minister) కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సమర్పించిన అధికారిక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆస్తుల మొత్తం విలువ రూ.1,413 కోట్లుగా ఉంది. ఇదివరకు రూ.931 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక సీఎంల జాబితాలో తొలి స్థానంలో కొనసాగేవారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయడంతో, చంద్రబాబు నాయుడు రెండవ స్థానానికి చేరుకున్నారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Read Also : కర్ణాటక రాజకీయాల్లో మార్పులు: సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం

టాప్-3 లో దక్షిణాది సీఎంల హవా
ఈ తాజా ఆస్తుల నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత ధనవంతులైన మొదటి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా దక్షిణాది రాష్ట్రాలకు (South Indian States) చెందిన వారే కావడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి రెండు స్థానాల్లో నిలవగా… తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూ.648 కోట్ల ఆస్తులతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఇటీవల ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ ఆస్తుల వివరాలు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఆర్థిక వనరులు, ఆస్తుల పరంగా దక్షిణాది రాష్ట్రాల అధినేతలే అత్యంత సంపన్నులుగా నిలవడం విశేషం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

