AP News:ఏపీలో జూలై 24న విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఈ బంద్ పిలుపునిచ్చారు.
ఈ ఆందోళనకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి అందరూ ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read also: Mega PTM 3.1: జూలై 24న జిల్లావ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీట్:కలెక్టర్
Educational institutions’ bandh the day after tomorrow.
కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల కష్టం నూరేళ్ల బూడిద అయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
AP News:బంద్ విజయవంతం చేయాలని పిలుపు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు జూలై 24న పూర్తిగా మూసివేయాలని కోరారు. విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ బంద్కు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించిన చంద్రబాబు

