CM Chandrababu Tour: మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబు సోమవారం రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆధునీకరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
Read Also : District : నేడు మూడు జిల్లాల్లో సిఎం పర్యటన
CM : పనుల ప్రారంభం – సీఎం ఆదేశాలు

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిపై కీలక చర్చ జరిపారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర జల సంఘం (CWC) సూచనల మేరకు, బ్యారేజీలో మిగిలిపోయిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది (2027) జూన్ నెల నాటికి ఈ కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బ్యారేజీని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

