Malviya Nagar Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది.
ఒక రెస్టారెంట్లో ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటల కారణంగా తొలుత 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరికొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 21 కి చేరింది.
Fire in a restaurant in Delhi.. Death toll reaches 21
Malviya Nagar Fire Accident: సిలిండర్ పేలుడే కారణమా?
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై ప్రముఖ వైద్య సంస్థ ‘మాక్స్ హెల్త్కేర్’ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. రెస్టారెంట్లో ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు వెల్లడించింది. పేలుడు ధాటికి మంటలు క్షణాల వ్యవధిలో రెస్టారెంట్ అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
రంగంలోకి ఢిల్లీ అగ్నిమాపక శ్రేణులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో ఢిల్లీ పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సేవలు అప్రమత్తమయ్యాయి. భారీ ఎత్తున ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దట్టమైన పొగలు, మంటల నుంచి పలువురిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ఢిల్లీలోని మాల్వీయ నగర్లో రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..10 మంది మృతి

