Anantapur: పదవీకాలం ముగిసిన పంచాయతీ సర్పంచు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఎంపీడీవో దాస్ నాయక్ అధ్యక్షతన వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. గురువారం డి.
హిరేహళ్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం (సచివాలయం 1) ఆవరణలో వైకాపా నాయకుడు, వీడిసి అధ్యక్షుడు సింగాడి మంజునాథ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటుచేశారు. ఈ వీడ్కోలు సన్మాన సభలో సర్పంచు లక్ష్మి, ఉపసర్పంచ్ కరిడి మల్లికార్జున, 14 మంది వార్డు సభ్యుల పనితీరు, గ్రామాభివృద్ధి(Village development) కోసం తమ సహాయ, సహకారాలు అందించారని పాలనాపరంగ తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చారని మెమొంటోలు అందజేసి సన్మానించి బహుమతులు అందజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

