Dailyhunt
దొంగతనాలకు అలవాటుపడ్డ కూతుళ్లు.. రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి..

దొంగతనాలకు అలవాటుపడ్డ కూతుళ్లు.. రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి..

వార్త 2 weeks ago

దొంగతనం అనుమానంతో కన్నతండ్రే కూతురిని తాడుతో కట్టేసి, వేలాడదీయడంతో ఆ బాలిక మరణించిన దిగ్భ్రాంతికర ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 51 ఏళ్ల నిందితుడు దాదు హైబత్ యమ్‌గర్‌ను అట్పాడి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా(Sangli District), అట్పాడి తాలుకాలోని బాన్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అమ్మాయిలు తరచూ దొంగతనాలకు పాల్పడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాదు యమ్‌గర్ కూతుళ్లు రితూజ, అనూజ పక్కింట్లో డబ్బులు దొంగతనం చేసినట్లు చెప్పారు. తండ్రి దాదు యమ్‌గర్‌కు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత, యమ్‌గర్ కోపంతో తన ఇద్దరి కూతుళ్ల కాళ్లు, చేతులు కట్టేసి.. రాత్రంతా ఇంట్లోని ఇనుప కమ్మీకి (రాడ్‌కు) వేలాడదీశారు. రాత్రంతా ఆ ఇద్దరు అమ్మాయిలు అలానే ఉన్నారు. దీంతో, ఇద్దరిలో ఒకరు దురదృష్టవశాత్తూ మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన తర్వాత అట్పాడి పోలీసులు దాదు యమ్‌గర్‌ను అరెస్ట్ చేశారు.

Read Also: Kerosene Distribution: మళ్ళీ రేషన్ కిరోసిన్ సరఫరా.. కేంద్రం కీలక నిర్ణయం!

 Maharastra Crime

Maharastra Crime: తుంటరి పనులు…పక్కింట్లో డబ్బులు దొంగతనం

దాదు యమ్‌గర్ బాన్‌పురి గ్రామంలోని యమ్‌గర్ కాలనీలో ఉంటున్నారు. కూలీగా పనిచేస్తారు. ఆయనకు ఐదుగురు పిల్లలు, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. వారిలో అనూజకు 11 ఏళ్లు, రితూజకు 9 ఏళ్లు. యమ్‌గర్ కాలనీలోని జిల్లా పరిషత్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. అనూజ ఐదో తరగతి, రితూజ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ఇద్దరూ తుంటరి పనులకు అలవాటుపడి, గత కొన్ని నెలల నుంచి స్కూల్‌లో, ఇంట్లో, ఇతర చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. బుధవారం (మార్చి 25న) ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనూజ, రితూజ తమ పక్కింట్లో డబ్బులు దొంగతనం చేశారు. ఆ కుటుంబం, దొంగతనం విషయాన్ని రితూజ, అనూజ తల్లిదండ్రులకు చెప్పింది. ఆ అమ్మాయిల తండ్రి దాదు యమ్‌గర్ సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాక ఆయనకు కూడా ఈ విషయం తెలిసింది. దొంగతనం గురించి తెలియగానే.. కోపంలో తాళ్లతో పిల్లలిద్దరి కాళ్లు, చేతులు కట్టేసి, ఇంటి పైకప్పుకి ఉన్న ఇనుప రాడ్‌కు వేలాడదీశారు. దాదు యమ్‌గర్ భార్య, ఆయన తల్లి, తండ్రి కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర ఆగ్రహానికి గురైన దాదు యమ్‌గర్, మధ్యలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వారందరినీ చంపేస్తానని బెదిరించారు. ఈ ఇద్దరూ రాత్రంతా వేలాడుతూనే ఉన్నారు. వారు బాగా ఏడ్చారు. వారికి దాహం వేసింది. ఆ తర్వాత వారికి రెండుసార్లు దాదు యమ్‌గర్ మంచినీళ్లు ఇచ్చారు. కానీ, వారిని కిందకి మాత్రం దించలేదు. ఉదయం అమ్మాయిలను కిందకి దించి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. పండర్పూర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా రితూజ అంబులెన్స్‌లోనే మరణించగా.. అనూజ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం అట్పాడిలో చికిత్స పొందుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

డీఎంకే 'సూపర్ స్టార్' మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ. 2000

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha