Dailyhunt
ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

వార్త 3 weeks ago

విశాఖలో గూగుల్ డేటా సెంటర్

Google Data Center : ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

ఈ మెగా ప్రాజెక్టుకు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా హాజరుకానున్నారు.

భారీ పెట్టుబడి ప్రాజెక్ట్

గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్‌ఫ్రా కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ డేటా సెంటర్ కోసం సుమారు 15 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీన్ని 1000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

Read Also:Patriot Trailer Release: ఇద్దరు సూపర్ స్టార్ల విశ్వరూపం..'పేట్రియాట్' ట్రైలర్ రిలీజ్

 Google Data Center

విశాఖకు టెక్ హబ్ గుర్తింపు

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ పరిధిలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో 601.4 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం తర్లువాడలో భూమి చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. 2028 జులై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా విశాఖ నగరం టెక్ హబ్‌గా ఎదగడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'రామాయణ్' విమర్శలపై హృతిక్ రోషన్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha