LPG Supply Central Govt: మిడిల్ ఈస్ట్ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ అయ్యింది.
దేశీయ అవసరాలకు ఎక్కడా కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
Read Also: New Rules: జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
Central government on alert over LPG supply
LPG Supply Central Govt: చమురు కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా దేశంలో వంటగ్యాస్ సంక్షోభం తలెత్తకుండా కేంద్ర పెట్రోలియం శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు (IOCL, BPCL, HPCL వంటివి) దేశంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను నిరంతరం సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతిన్నా, స్థానికంగా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ బఫర్ స్టాక్ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేదు: అధికారులు స్పష్టం
మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు స్పష్టం చేశారు. సిలిండర్ల బుకింగ్, డెలివరీ ప్రక్రియ ఎప్పటికప్పుడు సజావుగా సాగుతోందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సిలిండర్ల డెలివరీ వేగంగానే జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 నుండి 48 గంటల్లో సిలిండర్ల డెలివరీ అవుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 3 నుండి 5 రోజుల్లో వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ సిలిండర్లు చేరుతున్నాయని అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ముందస్తు నిర్ణయం దేశీయ ఎల్పీజీ వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తుండటంతో, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
పంజాబ్ మున్సిపల్ పోరులో ఆప్ క్లీన్ స్వీప్..బీజేపీకి ఎదురుదెబ్బ

