Dailyhunt
ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్.. వడ్డీలో 50% రాయితీ

ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్.. వడ్డీలో 50% రాయితీ

వార్త 3 weeks ago

Property Tax Discount: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మరియు నగర పంచాయతీల పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూలు చేసే లక్ష్యంతో ఈ వెసులుబాటు కల్పించింది.

Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

 Property Tax Discount: Good news for AP property tax defaulters.. 50% discount on interest

ఈ నెల 31 లోపే గడువు

ఈ రాయితీ సదుపాయం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మార్చి 31, 2026 నాటికి బకాయిలు చెల్లించే వారికి మాత్రమే ఈ 50 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత పాత పద్ధతిలోనే పూర్తి వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని, కావున బకాయిదారులు ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

రూ. 6,072 కోట్ల భారీ బకాయిలు

గడచిన 8 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖకు రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అసలు మరియు వడ్డీతో కలిపి సుమారు రూ. 6,072 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ భారీ మొత్తాన్ని రాబట్టేందుకు ప్రభుత్వం ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ తరహాలో ఈ రాయితీని ప్రకటించింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఏ పాపం తెలియని చిన్నారిని బలి తీసుకున్న బావ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha