Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేల కూతుళ్ల హవా!

ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేల కూతుళ్ల హవా!

వార్త 3 weeks ago

AP Politics: ఏపీ రాజకీయాల్లో మహిళా వారసులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు తమ కుమార్తెలను రాజకీయ వారసులుగా పరిచయం చేస్తున్నారు.

భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందనే అంచనాలతో నాయకులు ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

Read also: Bhimavaram: గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ కలెక్టరేట్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?

 Female Heirs in AP Politics

రాజకీయాల్లోకి కుమార్తెల ఎంట్రీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్య కూడా ప్రజా సేవలో అడుగుపెట్టారు. వీరంతా ఇప్పటికే పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపడుతున్నారు.

AP Politics: ముందుచూపుతోనే నాయకుల వ్యూహం

మహిళా రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ఈ మార్పు మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అర్చన వంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అనుభవం ఉన్న నాయకుల కుటుంబాల నుండి వారసులు రావడం వల్ల పార్టీలకు కూడా బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఆసక్తికరమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha