Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ తల్లికి వందనం గడువు పొడిగింపు

ఏపీ తల్లికి వందనం గడువు పొడిగింపు

వార్త 15 hrs ago

Thalliki Vandanam Scheme:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన కుటుంబాలకు ప్రతీ ఏటా ఆర్థిక సహాయం అందజేస్తోంది.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ పూర్తయింది. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదు. అలాంటి వారి కోసం ప్రభుత్వం కీలకమైన ప్రకటన విడుదల చేసింది.

Read also: AP Handicrafts QR Code: హస్తకళలకు గ్లోబల్ గుర్తింపు: 'లేపాక్షి'లో క్యూఆర్ కోడ్ వ్యవస్థ ప్రారంభం!

 Have the ‘Thalliki Vandanam’ funds not been received?

ఆగస్టు 7 వరకు అభ్యంతరాల స్వీకరణ

తల్లికి వందనం పథకం చివరి తేదీ గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. నిజమైన లబ్ధిదారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆగస్టు 7 వరకు వినతులు సమర్పించే సదుపాయం ఇచ్చింది. సచివాలయాల్లో ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరు లేని వారు సంబంధిత పత్రాలతో తమ అర్జిని అందజేయవచ్చు. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త జాబితా తయారు చేస్తారు.

Thalliki Vandanam Scheme:లబ్ధిదారులు చేయాల్సిన ముఖ్య పనులు

ముందుగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ సీడింగ్ పూర్తయిందో లేదో సరిచూసుకోవాలి. ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బులు జమ కావు. స్థానిక గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలి. ప్రభుత్వం పంపిన మార్గదర్శకాల ప్రకారం అధికారులు పరిశీలన జరిపి మిగిలిన వారికి సహాయం అందిస్తారు. ఈ చివరి అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవడం మంచిది.

Epaper: epaper.vaartha.com

మోడల్ స్కూల్స్ సిబ్బందికి తీపి కబురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha