AP PMAY Houses:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల నివాసాల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అర్హులకు పక్కా ఇళ్లు కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ రెండవ విడత పథకానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
మొదటి విడత కింద 4 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కీలక నిర్ణయంతో అనేక కుటుంబాల సొంతింటి కల త్వరలోనే నిజం కాబోతోంది.
Read also: AP Industrial Parks: కేంద్ర పథకంతో ఏపీలో పరిశ్రమల జోరు
Sweet news for the poor in AP
వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
ఈ పథకం అమలు ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు మరో వారం లేదా పది రోజుల్లో వెలువడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆమోదం తెలపడంతో రాష్ట్ర అధికారులు వేగవంతంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు చేరేలా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
AP PMAY Houses:తొమ్మిది లక్షల మందికి లబ్ధి
ఇటీవల నిర్వహించిన సర్వే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల అవసరాన్ని వెల్లడించింది. దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా నివాసాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి 4 లక్షల మందికి తొలి విడతలో అవకాశం దక్కుతోంది. మిగిలిన అర్హులకు కూడా రాబోయే రోజుల్లో ప్రాధాన్యం కల్పించి ఇళ్లను మంజూరు చేస్తారు.
Epaper: epaper.vaartha.com

