New Rules from April 1st: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే పలు మార్పులు అమలులోకి వస్తున్నాయి.
ముఖ్యంగా డిజిటల్ భద్రత, వాహన వినియోగం మరియు బ్యాంకింగ్ సేవల నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ మార్పుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం.
Read Also: India Ban on Chinese CCTV Cameras: చైనా కెమెరాలకు భారత్ చెక్
These are the key things that will change from April 1st!
డిజిటల్ చెల్లింపుల్లో ఓటీపీ ఇక చాలదు
ఇకపై డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో కేవలం ఓటీపీ (OTP) ఆధారంగా చెల్లింపులు చేయడం కుదరదు. భద్రతను పటిష్టం చేసేందుకు ప్రతి లావాదేవీకి కనీసం రెండు రకాల ధృవీకరణలు తప్పనిసరి చేశారు. ఇందులో భాగంగా పిన్ లేదా పాస్వర్డ్ తో పాటు రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి వాటిలో ఏవైనా రెండు పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ డబుల్ సెక్యూరిటీ విధానం వల్ల ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
New Rules from April 1st: పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం తప్పనిసరి
పర్యావరణ హితమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ వాడకం తప్పనిసరి కానుంది. ఇది వాహనదారులకు పర్యావరణ స్పృహను పెంచడంతో పాటు దేశీయ ఇంధన అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి తోడుగా వాహనదారులకు మరో హెచ్చరిక కూడా ఉంది. తమ ఫాస్ట్యాగ్ ఖాతాలకు కేవైసీ (KYC) పూర్తి చేయని వారి అకౌంట్లు తక్షణమే బ్లాక్ చేయబడతాయి.
బ్యాంకింగ్ ఛార్జీల పెంపు మరియు బీమా పాలసీలు
బ్యాంకింగ్ రంగంలో కూడా వినియోగదారులకు భారం పెరగనుంది. కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేశాయి. దీనివల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బీమా రంగంలో కూడా డిజిటలైజేషన్ వైపు అడుగులు పడ్డాయి. ఇక నుంచి జారీ చేసే అన్ని కొత్త బీమా పాలసీలు కచ్చితంగా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

