Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్ర బంగారంగా మారిన గుంటూరు మిర్చి సాగు

ఎర్ర బంగారంగా మారిన గుంటూరు మిర్చి సాగు

వార్త 1 week ago

Guntur mirchi price:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు చిట్టినేని అమర్‌నాథ్ నలభై ఎకరాల్లో కాదు కేవలం నాలుగు ఎకరాల్లో నాటు రకం సూపర్ 10 డీలక్స్ మిర్చిని సాగు చేసి అద్భుతం సృష్టించారు.

మిర్చి పంటను సాగు చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదనే మాటను నిజం చేస్తూ, ప్రతి దశలోనూ ఎన్నో తెగుళ్లను ఎదుర్కొంటూ ఎంతో జాగ్రత్తగా ఈ పంటను కాపాడుకున్నారు. జనవరి నెలలో వచ్చిన తొలి కాపు నాటికి మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో నిరుత్సాహ పడకుండా ఆ పంటను భద్రపరుచుకోవాలని ఆలోచించారు. వెంటనే ఆ మిరపకాయలను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసి సరైన సమయం కోసం ఓపికగా వేచి చూశారు. ఎరువుల నిర్వహణలోనూ, తెగుళ్ల నివారణలోనూ తగిన శ్రద్ధ తీసుకోవడం వల్ల పంట నాణ్యత ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోగలిగారు. సాధారణంగా ఎకరాకు వచ్చే దిగుబడి కంటే మెరుగైన ఫలితాలు సాధించి ఎకరాకు ఇరవై క్వింటాళ్ల చొప్పున మొత్తం ఎనుబది క్వింటాళ్ల దిగుబడిని సాధించారు.

Read also: Thalliki Vandanam Scam:తల్లికి వందనం పేరుతో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం!

 Native chilli variety turns into ‘red gold’

మార్కెట్లో పోటీ పెంచిన టాప్ క్వాలిటీ మిర్చి

ఇటీవల కాలంలో గుంటూరు మిర్చి యార్డ్‌లో ధరలు రైతులకు పూర్తిగా అనుకూలంగా మారుతుండటంతో తన పంటను విక్రయించేందుకు అమర్‌నాథ్ మూడు లాట్ల శాంపిల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. యార్డులోని శ్రీ కృష్ణవేణి చిల్లీస్ దిగుమతి షాపు వద్దకు ఆ శాంపిల్స్ తీసుకురాగానే ఎర్రగా నిగనిగలాడుతున్న ఆ టాప్ క్వాలిటీ మిరపకాయలను చూసి అక్కడి ఎగుమతిదారులు మరియు వ్యాపారులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుత మార్కెట్లో సాధారణ మిర్చి క్వింటా ధర ఇరవై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే పలుకుతుండగా, ఈ నాణ్యమైన మిర్చి కోసం బయ్యర్లు అందరూ పోటీ పడ్డారు. దాంతో వ్యాపారులు ఎగబడి మరీ క్వింటాకు ముప్పై రెండు వేల రూపాయల వరకు వేలం పాటను తీసుకెళ్లారు. దళారులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఏకంగా ముప్పై రెండు వేల రూపాయలు ఇస్తామని ముందుకొచ్చినా ఆ రైతు మాత్రం వెనకడుగు వేశారు. తన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని, తన పంటకు ఇంకా ఎక్కువ విలువ ఉందని గట్టిగా నమ్మి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.

Guntur mirchi price:నాల్గు వేల ఆశతో కోల్డ్ స్టోరేజ్ లోనే పంట

ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర ముప్పై రెండు వేల రూపాయలు పలుకుతున్నప్పటికీ, తన ఎర్ర బంగారానికి నలభై వేల రూపాయల గిట్టుబాటు ధర కచ్చితంగా లభిస్తుందని అమర్‌నాథ్ గట్టిగా ఆశిస్తున్నారు. అందుకే వచ్చిన లాభాన్ని వెంటనే తీసుకునే బదులు, తనకు ఆశించిన ధర వచ్చే వరకు వేచి చూడాలనే పట్టుదలతో వంద టిక్కీల మిర్చిని యార్డులోనే అలాగే ఉంచేశారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం చూసి స్థానిక ఏఎంసీ అధికారులు సైతం ఆశ్చర్యపోతూ రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలోనూ తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని నాణ్యతను కాపాడుకున్నందుకు ఈ స్థాయి రికార్డు ధర దక్కిందని అధికారులు వెల్లడించారు. సరైన ప్రణాళిక, తెగుళ్ల నిర్వహణ మరియు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే వ్యవసాయంలో ఏ రైతు అయినా అద్భుతాలు సృష్టించవచ్చని అమర్‌నాథ్ అందరికీ నిరూపించి చూపించారు.

Epaper: epaper.vaartha.com

తల్లికి వందనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇదే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha