Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భారీ మార్పులు.. ఇకపై నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భారీ మార్పులు.. ఇకపై నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు!

వార్త 2 weeks ago

TS Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ కావాలంటే విద్యార్థులు తమ ఆధార్ కార్డును టెన్త్ క్లాస్ మెమోతో సరిపోల్చుకోవాలి. పదో తరగతి సర్టిఫికేట్‌లో ఉన్న పేరు, ఇంటిపేరు ఆధార్‌ కార్డులో ఉన్నట్లుగా కచ్చితంగా ఉండాలి.

ఏమాత్రం తేడా ఉన్నా ఆన్‌లైన్ దరఖాస్తు ముందుకు సాగదు. కాబట్టి వివరాల్లో తప్పులు ఉంటే ఈ వేసవి సెలవుల్లోనే ఆధార్ సెంటర్లలో సరిచేసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిబంధనను పక్కాగా అమలు చేస్తోంది.

Read also: Water Crisis in Hyderabad: హైదరాబాద్‌లో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

 Student checking Aadhar and Memo details

TS Fee Reimbursement: నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న పద్ధతిని మారుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎస్సీ విద్యార్థులతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరికీ ఫీజులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. కాలేజీలతో సంబంధం లేకుండా నేరుగా నగదు బదిలీ జరగడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థులు తమ బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలి. మొబైల్ నంబర్ కూడా ఆధార్‌తో లింక్ అయి ఉంటేనే ఓటీపీ ప్రక్రియ సులభమవుతుంది.

దరఖాస్తు ప్రక్రియలో కొత్త పద్ధతులు

కొత్తగా అప్లై చేసేవారు లేదా రెన్యువల్ చేసుకునేవారు ముందుగా టెన్త్ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి. వివరాలు మ్యాచ్ అయిన తర్వాతే మీ-సేవ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 12 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ. 2400 కోట్లు వెచ్చిస్తోంది. దాదాపు 20 శాతం మంది విద్యార్థుల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం లోపే ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

యావన్ హత్య.. యువతి ఇంటి ముందు భారీ నిరసన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha