Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం

ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం

వార్త 2 weeks ago

Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన యువకుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ మరణించిన సంఘటన.

వివరాలు పోలవరం జిల్లా వంచంగి గ్రామానికి చెందిన కోసూరి రాంబాబు, కూటమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం కలరు. మొదటి అబ్బాయి కోసూరి శివకుమార్ రెడ్డి ( 19) సం. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తున్నాడు.

Read also: Vivek Yadav: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. కీలక అప్డేట్ ఇచ్చిన సీఈఓ వివేక్ యాదవ్

 Youth dies following father’s reprimand.

Rajavommangi crime:పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఈనెల 12 తేదీ రాత్రి మద్యం సేవించి వచ్చి భోజనం చేయకుండా తండ్రిని సెల్ ఫోన్ అడగడంతో ఇవ్వనని అన్నాడు. భోజనం చేయకుండా మనస్తాపం చెంది అదే రోజు రాత్రి 11.30 ని. సమయంలో పురుగుమందు త్రాగడంతో కుటుంబీకులు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతూ శివకుమార్ రెడ్డి మరణించాడు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ చినబాబు తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబీకులు సమక్షంలో శవపంచనామా నిర్వహించడం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నేడు విజయవాడకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha