Free Laptop Scheme: విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ 2026 పేరుతో ఈ పథకం అమలు చేస్తోందని నెటిజన్లు నమ్ముతున్నారు.
అయితే ఇదంతా కేవలం అబద్ధపు ప్రచారం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మి మోసపోవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also: Annamalai : అన్నామలైపై TVK సెటైర్లు
Free laptops for students
అసలు నిజం ఏంటంటే
ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ల్యాప్టాప్ పథకం ప్రారంభించలేదు. జాతీయ స్థాయిలో ఇటువంటి కార్యక్రమం ఏదీ అమలులో లేదు. ఇంటర్నెట్లో కనిపిస్తున్న వెబ్సైట్లు విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫేక్ లింకుల ద్వారా డేటా చోరీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.
Free Laptop Scheme: మోసపూరిత లింకులకు దూరంగా ఉండండి
తెలియని లింకులను క్లిక్ చేయడం ద్వారా ఫోన్ లేదా కంప్యూటర్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, ఫోన్ నంబర్లు తెలియని వ్యక్తులకు ఇవ్వకండి. ఏ పథకం అయినా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చూడండి. నమ్మదగిన సమాచారం కోసం ఎప్పుడూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఛానెళ్లను మాత్రమే అనుసరించండి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

