ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ఏకంగా 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా అకడమిక్ ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఇది విద్యా రంగంలో ఒక చరిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు.
Read Also : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒక రోజు 'నో వెహికిల్ డే'!

పోస్టుల వివరాలు మరియు దరఖాస్తు గడువు
ఈ భారీ రిక్రూట్మెంట్లో వివిధ కేడర్లకు చెందిన పోస్టులను పొందుపరిచారు. వీటిలో:
అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 334 పోస్టులు
ప్రొఫెసర్: 63 పోస్టులు
లెక్చరర్: 104 పోస్టులు
ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18 నుండి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీహెచ్డీ (Ph.D) మరియు నెట్/సెట్ (NET/SET) అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.
నిరుద్యోగులకు భరోసా.. ఉన్నత విద్యకు ఊతం
గత కొంతకాలంగా విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ కొరత కారణంగా పరిశోధనలు, బోధన కుంటుపడుతున్న నేపథ్యంలో, ఈ నియామకాలు వ్యవస్థకు కొత్త జవజీవాలను అందిస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15న నోటిఫికేషన్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పారదర్శకమైన పద్ధతిలో, ఎటువంటి జాప్యం లేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

