ACCIDENT IN Gajuwaka : విశాఖపట్నంలోని గాజువాక జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజమండ్రి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు పార్వతీపురం వెళ్తుండగా, గాజువాక పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగంతో పాటు, కుడి వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు బస్సులోని సీట్లు సైతం ఊడిపోయి రోడ్డుపై చల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తసిక్తమైన దృశ్యాలు అత్యంత భీతావహంగా మారాయి.
Read Also : ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..?:మంత్రి !
ఏడుగురికి తీవ్ర గాయాలు: సహాయక చర్యల్లో పోలీసులు!
ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, ప్రయాణికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల దేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు. తెల్లవారుజామున పూట డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం లేదా దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న టిప్పర్ కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

