Uttar Pradesh tragedy: ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా ధానా గ్రామంలో తీవ్ర విషాదం నిండింది. ఖుష్బూ నిషాద్ అనే పద్దెనిమిదేళ్ల యువతికి ఈ నెల 8వ తేదీన వివాహం జరగాల్సి ఉంది.
ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. శీతల పానీయం తాగిన ఖుష్బూ నిషాద్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. సంతోషంగా సాగాల్సిన పెళ్లి వేడుక కాస్తా ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.
Read also: Kakinada News: ధాన్యం కాపాడబోయి అనంతలోకాలకు.. పిడుగుపాటుతో అన్నదాత మృతి
Young woman dies after drinking soft drink.
Uttar Pradesh tragedy: అస్వస్థతకు గురైన చిన్న పిల్లలు
ఖుష్బూ నిషాద్తో పాటు ఆ కూల్ డ్రింక్ తాగిన మరికొందరు చిన్నారులు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న పిల్లలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ సరైన సమయంలో వైద్యం అందడంతో పిల్లలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ఘటనతో స్థానిక గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఎక్స్పైరీ డేట్ పానీయమే కారణమా?
ఆమె తాగిన శీతల పానీయం గడువు ముగిసిపోవడం (Expired) వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. బాధితురాలు తాగిన బాటిల్ కాలం చెల్లిందని అధికారులు గుర్తించారు. ప్రజలు ఏదైనా ఆహారం లేదా పానీయాలు కొనేటప్పుడు తప్పనిసరిగా వాటి తయారీ తేదీని తనిఖీ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొనడం అందరినీ కలిచివేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మీర్పేటలో భారీ చిట్ ఫండ్ మోసం! రూ. 2 కోట్లతో భార్యాభర్తలు జంప్

