Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసు: వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసు: వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వార్త 1 week ago

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన గండిపేటలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు నకిలీ జీవోలను సృష్టించిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు.

గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న ఆయనను సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నెం.18లో ఉన్న 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు బ్రహ్మనాయుడు తెరవెనుక భారీ కుట్ర నడిపినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ భూమికి సంబంధించి నకిలీ జీవోలను తయారు చేయడం, వాటి ప్రతులను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీనికి అదనంగా, బ్రహ్మనాయుడు ఖాతా నుండి రూ.1.25 కోట్ల నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించడంతో ఆయనపై ఆరోపణలకు బలమైన ఆధారాలు లభించాయి.

Read Also: Lingamaneni Ramesh Janasena:జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్? సాయంత్రం ప్రకటించనున్న పవన్!

 Brahmanaidu Arrest

Brahmanaidu Arrest: కాంచీపురంలో దొరికిన మాజీ ఎమ్మెల్యే

ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్ర పన్నిన ఈ కేసులో బ్రహ్మనాయుడుతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఏపీలోని నరసరావుపేటలో ఉన్న బ్రహ్మనాయుడు నివాసంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేయగా, ఆయన లభించలేదు. ఇతర నిందితులైన బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్‌తో పాటు మరికొందరు కూడా పరారీలో ఉన్నారు. నిందితులు హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు, ఎట్టకేలకు శుక్రవారం కాంచీపురంలో బ్రహ్మనాయుడును అదుపులోకి తీసుకున్నారు.

రూ.4 కోట్ల డీల్.. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ!

గండిపేటలో సుమారు రూ.1500 కోట్ల విలువైన ఈ భూకబ్జా వ్యవహారంలో బ్రహ్మనాయుడే ప్రధాన సూత్రధారి అని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. నకిలీ జీవోను సృష్టించడం కోసం రాధాకృష్ణ అనే వ్యక్తికి బ్రహ్మనాయుడు రూ.4 కోట్లు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలన్నీ నగదు (Cash) రూపంలో జరగడంతో ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే కోణంలో పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. భూమిని క్రమబద్ధీకరించాలంటూ కలెక్టర్‌, సీసీఎల్‌ఏ (CCLA) కార్యాలయాలకు ఫైళ్లు వెళ్లినట్లు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, ఐఏఎస్ అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ఫేక్ ఆర్డర్ల తయారీలో రాధాకృష్ణకు ఒక లాయర్‌తో పాటు మరో ఇద్దరు సహకరించారు. నిందితుడైన రాధాకృష్ణపై ఇప్పటికే 9 కేసులు ఉన్నాయని, అతని వద్ద కందుకూరు, అంబర్‌పేట ప్రాంతాలకు చెందిన ల్యాండ్ డాక్యుమెంట్లతో పాటు వివిధ నకిలీ సంస్థల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వైఎస్ షర్మిలకు దక్కని రాజ్యసభ టికెట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha