Godavari Pushkaralu 2027: రాజమహేంద్రవరంలో 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మొదటి విడతలో భాగంగా రూ. 9.55 కోట్ల వ్యయంతో పట్టణంలోని ప్రధాన ఆలయాలను సుందరీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి నుంచే పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Read also: IPL Betting cases: బెట్టింగ్లు, జూదంపై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా

Godavari Pushkaralu 2027 Works Start
Godavari Pushkaralu 2027: పక్కా ప్రణాళికతో ఆలయాల అభివృద్ధి
పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పటికే మూడు కీలక సమావేశాలు జరిగాయి. 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మహోత్సవం కోసం 43 ఆలయాల అభివృద్ధికి రూ. 51.79 కోట్లు కేటాయించారు. కోటిలింగాల రేవులోని పిండ ప్రదాన భవనం, రమా సత్యనారాయణ స్వామి ఆలయ ముఖ మండపం వంటి నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. రాజమండ్రి పరిసరాల్లోని 6 ప్రధాన దేవాదాయ సంస్థల పునర్నిర్మాణ పనులు ఈ దశలో పూర్తి కానున్నాయి.
కోట్లాది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
ఈసారి పుష్కరాలకు దేశ విదేశాల నుండి సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గోదావరి నది ప్రవహించే ఐదు జిల్లాల్లోని 212 కిలోమీటర్ల మేర స్నాన ఘట్టాలను ఆధునీకరించనున్నారు. జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

