Gummadidala: కో-ఆప్షన్ సభ్యులుగా నలుగురు ఏకగ్రీవ ఎన్నిక
మునిసిపల్ కమిషనర్ దశరథ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
అభివృద్ధికి కొత్త దిశగా ముందడుగు
Read Also :Census 2027: సంగారెడ్డిలో జనగణన-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం
Gummadidala: BRS dominates Gummadidala Municipality
గుమ్మడిదల మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా సాగి, సద్ది విజయ భాస్కర్ రెడ్డి, మహమ్మద్ ఫయాజ్, లూజహన్, కాలమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సమగ్ర మద్దతుతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నికైన నూతన కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ దశరథ్ చేతుల మీదుగా నియామక పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్న పాపని కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. వైస్ చైర్మన్ సంధ్య రెడ్డి కూడా నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సభ్యుల ఎన్నికతో మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

