హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు
Hormuz strait tension : ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి హార్మూజ్ జలసంధిపై పడింది.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.
బ్లాకేడ్ హెచ్చరిక
హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేసే దిశగా అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ నేవీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.
ఇరాన్ హెచ్చరిక
అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అవసరమైతే భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపుతామని కూడా ప్రకటించింది.
Read Also: iran and america: మాకు మేమే.. మీకు మీరే!
Hormuz strait tensionచమురు ధరలపై ప్రభావం
ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదింట ఒక వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో కూడా పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఒకవేళ ఈ మార్గం మూసివేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
చైనా ఆందోళన
ఈ పరిస్థితిపై చైనా కూడా స్పందించింది. హార్మూజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదని, ఇది ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

