హనుమకొండ (Hanumakonda) జిల్లాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కాలేజీ తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఓ లెక్చరర్ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కమలాపూర్ మండలంలో ఉన్న మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న నన్నబోయిన శ్రీశైలం.. ఇవాళ గుండెపోటుతో చనిపోయారు.సోమవారం ఉదయం విద్యార్థులకు అటెండెన్స్ తీసుకున్న నన్నబోయిన శ్రీశైలం.. పాఠం ప్రారంభించగానే ఒక్కసారిగా గుండెపోటు కు గురయ్యారు.
Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
అక్కడే కూప్పకూలిపోయినట్లు ఆ క్లాస్ విద్యార్థులు వెల్లడించారు. ఇక శ్రీశైలంకు గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకున్న మిగితా లెర్చరర్లు, కాలేజీ సిబ్బంది.. చికిత్స కోసం వెంటనే అతడిని హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికితరలించారు. అయితే అప్పటికే ఆ లెక్చరర్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక లెక్చరర్ శ్రీశైలంకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు కాలేజీ వర్గాలు తెలిపాయి.ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీశైలం ఆకస్మికంగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com

