అధికారంలోకి వచ్చాకే అబద్ధాలు మాట్లాడుతున్నాడు…
Yennam Srinivas Reddy Comments: 'హరీష్ రావు నాకు మంచి మిత్రుడు.. ఉద్యమంలో కలిసి పని చేశాను.. అధికారంలోకి వచ్చాకే అబద్ధాలు మాట్లాడుతున్నాడు' అంటూ..
విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Read Also: Mailardevpally: పాతకక్షలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్!
Yennam Srinivas Reddy’s criticism of Harish Rao.
Yennam Srinivas Reddy Comments: గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజం
గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ రెండు బ్యాలెన్స్ తప్పాయని పేర్కొన్నారు. రెండు కీలక శాఖలు హరీష్ రావు వద్దే ఉన్నాయని అవి పూర్తి వైఫల్యం చెందాయి అన్నారు. కాలేశ్వరం కడితే అది కూలిపోయిందని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల వివాదాల్లో కూరుకుపోయిందన్నారు. గతంలో జీతాలు కూడా ఇవ్వలేని ఏర్పడిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ వయసు పెంచి 17,000 మంది పెన్షన్ బెనిఫిట్స్ పెండింగ్ లో పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భారం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం పై పడింది అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం 66 వేల కోట్లు వడ్డీలు కడుతుందన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

