Indian Oil Tankers Return from Hormuz: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్పై కాల్పులు జరపడంతో సముద్ర మార్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ పరిణామంతో రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా సుమారు 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి మళ్లాయి.
Read Also:Iran Reopens Airspace: ఇరాన్ తన గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరిచింది
ఈ ఘటన ఒమన్కు 20 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) ధృవీకరించింది. తమ కథనం ప్రకారం, ఇరాన్కు చెందిన రెండు గన్బోట్లు ఎలాంటి రేడియో హెచ్చరికలు జారీ చేయకుండా ఒక ట్యాంకర్ను సమీపించి కాల్పులకు తెగబడ్డాయి. అయితే, ఈ ఘటనలో నౌకకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి హాని జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ట్యాంకర్ మాస్టర్ నివేదించినట్లు యూకేఎంటీవో తెలిపింది.
Indian Oil Tankers Return from Hormuz: ఇరాన్ సంచలన ప్రకటన – అమెరికాపై ప్రతీకారం?
ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ ప్రకటించడం కలకలం రేపింది:అమెరికా తమ నౌకలపై విధిస్తున్న ఆంక్షలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఇరాన్ స్పష్టం చేసింది.అమెరికా ఆంక్షలు ఎత్తివేసే వరకు జలసంధిపై తమ ఆధిపత్యం మరియు నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ పేర్కొంది.
Strait of Hormuz Tension Iran Firing
భారత నౌకలపై ప్రభావం
ఇరాన్ చర్యల వల్ల వెనక్కి మళ్లిన నౌకల్లో భారత్కు చెందిన రెండు కీలక నౌకలు ఉన్నాయి:ఇరాక్ నుండి 20 లక్షల బ్యారెల్స్ చమురును తరలిస్తున్న భారీ సూపర్ ట్యాంకర్ ఇరాన్ కాల్పుల భయంతో వెనక్కి మళ్లింది.లారక్ ద్వీపం సమీపంలో ఉన్న సుమారు 10 నౌకలు తమ దిశను మార్చుకున్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా సూచిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండానే వెళ్తుంది. తాజా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
హర్మూజ్ జలసంధిపై IRGC పట్టు: 'కొత్త ఆర్డర్' పేరుతో కఠిన నిబంధనలు

