West Bengal Fire Accident: పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తారాపీఠ్లో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఒక నాలుగు అంతస్తుల లాడ్జీ/హోటల్లో అకస్మాత్తుగా అగ్నికీలలు చెలరేగడంతో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Read Also :Ayithampudi Canal Car Accident:పశ్చిమ గోదావరిలో కారు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిద్రలోనే కబళించిన మంటలు: పలువురికి తీవ్ర గాయాలు

ఉదయం 4:30 నుండి 5:00 గంటల మధ్య సమయం కావడంతో హోటల్ గదుల్లో ఉన్న భక్తులంతా గాఢనిద్రలో ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు వేగంగా వ్యాపించడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
West Bengal Fire Accident: రాంపూర్హాట్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే రాంపూర్హాట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

