Danam Nagender:ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల డ్రా తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్థానికేతరులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ప్రకటన ప్రకారం నియోజకవర్గానికి రావాల్సిన పూర్తి కోటాలో కేవలం కొద్దిమందికి మాత్రమే లబ్ధి చేకూర్చడంపై ఆయన స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తారు.
Read also: CM Revanth Reddy On Disciplinary Actions : ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ
Allegations of irregularities in housing allotment
అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం
హౌసింగ్ బోర్డ్ అధికారుల పద్ధతి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని దానం నాగేందర్ మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండానే డ్రా నిర్వహించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారుల బాధ్యతారాహిత్యం ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోందని హెచ్చరించారు.
Danam Nagender:ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చర్యలు
అధికారులు తమ వైఖరిని మార్చుకుని పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలని కోరారు. తప్పు చేసిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Epaper: epaper.vaartha.com

