Dailyhunt
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

వార్త 2 weeks ago

Madhya Pradesh crime: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. 22 ఏళ్ల మనోజ్ రజక్ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో (Instagram Live) ఉంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also :Bihar : అతివేగం నలుగురి ప్రాణాలు పోయేలా చేసింది..!!

స్నేహితులు చూస్తుండగానే అంతం

 Ended right before the eyes of friends.

శుక్రవారం రాత్రి మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చాడు. స్నేహితులతో సాధారణంగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తూ, ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. లైవ్ చూస్తున్న స్నేహితులు షాక్‌కు గురై, వెంటనే అతని ఇంటికి చేరుకున్నారు. అయితే, వారు వెళ్లేసరికే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు.

Madhya Pradesh crime: దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు తెలిపారు. మనోజ్ మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అతను అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఐస్‌క్రీమ్ గొడవ ప్రాణం తీసింది..అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha