Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ వ్యాఖ్యలపై ఎంపీ కలిశెట్టి ఘాటు విమర్శలు

జగన్ వ్యాఖ్యలపై ఎంపీ కలిశెట్టి ఘాటు విమర్శలు

వార్త 1 week ago

Kalisetti Appala Naidu: విశాఖపట్నం సమీపంలోని ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి క్రెడిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.

ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుంటే, మరోవైపు ఇటువంటి విమర్శలు చేయడం జగన్‌కే చెల్లుతుందన్నారు.

గతంలో ఎయిర్‌పోర్ట్‌ను అవహేళన చేసిన జగన్: ఎంపీ మండిపాటు

గతంలో ప్రతిపక్ష నేత హోదాలో భోగాపురం ప్రాంతంలో పర్యటించిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఎర్రబస్సు సరిగ్గా రాని ఈ మారుమూల ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్, ఎయిర్ బస్సులు ఇక్కడెందుకు?” అంటూ నాటి రోజుల్లో భోగాపురం ప్రాజెక్టును జగన్ తీవ్రంగా అవహేళన చేశారని ఆయన దుయ్యబట్టారు. నేడు అదే ప్రాజెక్టు సిద్ధమవుతుంటే క్రెడిట్ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

Kalisetti Appala Naidu: జగన్ సాధించిన ‘ప్రత్యేక క్రెడిట్’పై ఘాటు సెటైర్లు

జగన్ తన రాజకీయ జీవితంలో సాధించిన ‘ప్రత్యేక క్రెడిట్’ను ఎవరూ ఎప్పటికీ దొంగిలించలేరని అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయన సాధించిన ఆ ప్రత్యేక క్రెడిట్‌ను నిజంగానే ఎవరైనా చోరీ చేస్తే, వారు చివరికి జైలు పాలవ్వాల్సి వస్తుందని తీవ్రమైన సెటైర్లు వేశారు. జగన్ చేస్తున్న ఇటువంటి అబద్ధపు ప్రచారాలను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నవ్వుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఎంపీ స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చేతుల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నారా లోకేశ్ నాయకత్వంలో పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ

రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యాశాఖ అత్యంత పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తోందని అప్పలనాయుడు కొనియాడారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తిగా నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. విద్యా వ్యవస్థపై అవగాహన లేకుండా మాట్లాడేవారు, మంత్రి లోకేశ్ విసిరిన సవాలును ఎదుర్కొనే దమ్ములేక పారిపోయారని ఆయన విమర్శించారు.

Epaper: epaper.vaartha.com

విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha