Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జై శ్రీరామ్' నినాదాలతో మారుమోగిన ఢాకా వీధులు!

జై శ్రీరామ్' నినాదాలతో మారుమోగిన ఢాకా వీధులు!

వార్త 2 weeks ago

Sri Rama Statue Demolition Bangladesh: పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీల హక్కులు, భద్రత అంశం మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది.

రంగపూర్‌లో నిర్మిస్తున్న 81 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహం (81-foot Sri Rama Statue) ప్రాజెక్టును ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు వ్యతిరేకించడం.. నిరసనల్లో భాగంగా శ్రీరాముడి చిత్రపటాన్ని చెప్పుతో అవమానించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా అగ్గిరాజేశాయి. దీనికి నిరసనగా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని ఢాకా (Dhaka) వీధుల్లో వేలాది మంది హిందువులు కాగడాల ప్రదర్శనతో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున భగ్గుమన్నారు.

వివాదానికి కారణమైన ₹15.6 కోట్ల భారీ విగ్రహ ప్రాజెక్ట్

బంగ్లాదేశ్‌లోని ఉత్తర గైబంధా జిల్లా పలాశ్‌బరిలో గల శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ఆధ్యాత్మిక సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (సుమారు ₹15.6 కోట్లు) అంచనా వ్యయంతో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాముడి విగ్రహ నిర్మాణం 80 శాతం పూర్తయింది. అయితే, ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపుల నుండి ప్రాణాపాయ బెదిరింపులు రావడంతో తీవ్ర భయాందోళనల మధ్య పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ తెలిపారు.

Read Also :Hindus In Bangladesh : శ్రీరాముడిని అవమానించారని బంగ్లాదేశ్ హిందువుల నిరసన

ఢాకాను ముంచెత్తిన హిందూ సంఘాల నిరసన ప్రదర్శన

హిందూ మహాజోత్ సహా పలు మైనారిటీ సంఘాల పిలుపు మేరకు ఢాకాలోని ప్రధాన కూడలి అయిన షాబాగ్‌లో వేలాది మంది హిందువులు శనివారం సమావేశమయ్యారు. షాబాగ్ నుండి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ వెలుపల కిలోమీటర్ల మేర మానవహారం (Human Chain) ఏర్పాటు చేయగా, ఢాకా రిపోర్టర్స్ యూనిటీ (DRU) భవనం వద్ద కూడా నిరసనలు జరిగాయి. రంగపూర్‌లో ర్యాలీకి ప్రయత్నించిన హిందువులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది.

ప్రభుత్వానికి 72 గంటల డెడ్‌లైన్ - హిందూ మహాజోత్ హెచ్చరిక

గైబంధాలో జరిగిన నిరసనల్లో శ్రీరాముడి చిత్రపటంపై షూ ఉంచి అవమానించిన నిందితులపై కేసు నమోదైనా.. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నిందితులను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ప్రభుత్వానికి గడువు విధించాయి. లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.  64 జిల్లాల్లో రామాలయాలు: విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం తిరిగి భద్రతతో కూడిన అనుమతులు ఇవ్వకపోతే, బంగ్లాదేశ్‌లోని అన్ని 64 జిల్లాల్లో రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

Sri Rama Statue Demolition Bangladesh: మళ్లీ తెరపైకి మైనారిటీల భద్రత - ఘోరమైన గణాంకాలు

బంగ్లాదేశ్‌లో మొత్తం జనాభాలో సుమారు 8 శాతం మంది హిందువులు (అతిపెద్ద మైనారిటీ వర్గం) ఉన్నారు. గత మహమ్మద్ యూనస్ ప్రభుత్వ పతనం, రాజకీయ సంక్షోభం తర్వాత హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు పెరిగాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహమాన్ మత సామరస్యం గురించి మాట్లాడుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కేవలం ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 మధ్యే దేశంలో 133 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు కావడం అక్కడి హిందువుల దుస్థితికి అద్దం పడుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రోడ్డు పక్కన ఐఈడీ బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha