Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూలై 1 నుంచి మారనున్న రూల్స్.. సామాన్యుడిపై ప్రభావం!

జూలై 1 నుంచి మారనున్న రూల్స్.. సామాన్యుడిపై ప్రభావం!

వార్త 5 days ago

New Rules From July: జూన్ నెల ముగింపునకు రావడంతో బుధవారం నుంచి మనం జూలై నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి నెల మొదటి తేదీలాగే ఈసారి కూడా జూలై 1 నుంచి దేశంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించనున్నాయి. ముఖ్యంగా పాస్‌పోర్ట్ ఫీజుల పెంపుతో పాటు ఆధార్ కార్డు అప్‌డేట్, క్రెడిట్ కార్డ్ నిబంధనలు మరియు గ్యాస్ ధరల్లో మార్పులు రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Read Also: Population : జనాభాలో ఎక్కువ.. ప్రగతి ప్రమాణాల్లో తక్కువ

 Rules changing from July 1… Impact on the common man!

New Rules From July: భారీగా పెరగనున్న పాస్‌పోర్ట్ ఫీజులు

జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ సేవలు మరింత భారం కానున్నాయి. వివిధ కేటగిరీల్లో ఫీజులను ప్రభుత్వం భారీగా సవరించింది.

  • సాధారణ పాస్‌పోర్ట్ (36 పేజీలు): దీని ఫీజు రూ. 1,500 నుంచి ఏకంగా రూ. 2,500 లకు పెరిగింది.
  • తత్కాల్ పాస్‌పోర్ట్: తత్కాల్ సేవల రుసుమును రూ. 3,500 నుంచి రూ. 5,000 కి పెంచారు.
  • పెద్ద పాస్‌పోర్ట్ (60 పేజీలు): దీని ధరను రూ. 3,500 నుంచి రూ. 6,000 లకు పెంచడం జరిగింది.
  • డూప్లికేట్ పాస్‌పోర్ట్: పాస్‌పోర్ట్ పోయినా లేదా పాడైపోయినా కొత్తదాని కోసం గతంలో రూ. 1,750 చెల్లించేవారు, ఇకపై దానికి రూ. 4,250 చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ ఉచిత అప్‌డేట్.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్

ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక పెద్ద ఊరటనిచ్చింది. గతంలో ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవడానికి రూ. 75 చెల్లించాల్సి ఉండేది. అయితే జూలై 1 నుంచి వచ్చే 6 నెలల పాటు ఈ రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన కొన్ని ‘ఫోన్ పే SBI క్రెడిట్ కార్డ్’ రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రామ్‌లో మార్పులు చేస్తూ, రివార్డ్ పాయింట్లపై పరిమితులు (క్యాపింగ్) విధించింది.

ఆర్బీఐ (RBI) కొత్త రూల్

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి, తమ ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా లేదా తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలను తెచ్చింది. ఇలాంటి మోసపూరిత ఉత్పత్తులను కొనుగోలు చేసి నష్టపోయిన వినియోగదారులు ఇకపై పూర్తి రీఫండ్ (డబ్బు వెనక్కి ఇవ్వడం),నష్టపరిహారం పొందేందుకు అర్హులని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ రూల్ జూలై 1 నుంచే అమలులోకి రానుంది.

గ్యాస్, ఇంధన ధరల్లో మార్పులు?

ప్రతి నెల ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో జూలై 1 నుంచి కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. వీటిపై చమురు కంపెనీలు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నాయి.

Epaper: epaper.vaartha.com

యూరప్ ఎండలపై యూపీ యువతి ఆవేదన..ఇక్కడ 33°C కే చచ్చిపోతున్నాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha