Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జులై 11న విశాఖపట్నంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్

జులై 11న విశాఖపట్నంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్

వార్త 1 month ago

Visakhapatnam: భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించనుంది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ 17A సిరీస్‌లో ఆరవ అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' (INS Mahendragiri) భారత నౌకాదళంలో చేరడానికి సర్వం సిద్ధమైంది.

2026, జులై 11న విశాఖపట్నం వేదికగా ఈ నౌకను అధికారికంగా విధుల్లోకి తీసుకోనున్నారు. గత నెలలోనే ‘ఐఎన్ఎస్ దూనగిరి’ నేవీ సేవల్లోకి రాగా, ఇప్పుడు మహేంద్రగిరి కూడా తోడవనుంది. ఈ యుద్ధనౌక విశాఖ కేంద్రంగా పనిచేసే తూర్పు నౌకాదళ కమాండ్‌లో కీలక భాగం కానుంది.

తూర్పు కనుమలలోని ప్రసిద్ధ పర్వత శ్రేణుల జ్ఞాపకార్థం ఈ నౌకకు ‘మహేంద్రగిరి’ అని పేరు పెట్టారు. ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ నౌకను నిర్మించగా, నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనికి అద్భుతమైన డిజైన్‌ను అందించింది. ఈ యుద్ధనౌక “శక్తిమంతమైన, గంభీరమైన, సాటిలేనిది” అనే స్ఫూర్తిదాయక నినాదంతో సముద్రతీర రక్షణలో సేవలు అందించనుంది.

‘ఆత్మనిర్భర్ భారత్’కు నిదర్శనం

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ ప్రాజెక్టులలో ఒకటైన ప్రాజెక్ట్ 17A కింద మొత్తం ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్‌లను రూపొందిస్తున్నారు. ఈ శ్రేణిలో మహేంద్రగిరి ఆరవది కాగా, ఆఖరిదైన ఏడవ నౌక ‘ఐఎన్ఎస్ వింధ్యగిరి’ ప్రస్తుతం కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) వద్ద ముస్తాబవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలకు అనుగుణంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు.

Visakhapatnam: శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధ సంపత్తి

శత్రుదేశాల రాడార్ల కంటికి చిక్కకుండా సముద్ర గర్భంలో దూసుకెళ్లే ప్రత్యేక ‘స్టెల్త్ టెక్నాలజీ’ ఈ నౌక సొంతం. దీనితో పాటు వినాశకర బ్రహ్మోస్ క్షిపణులు, గగనతల రక్షణ కోసం బరాక్-8 మిస్సైళ్లు, మరియు శత్రు జలాంతర్గాములను మట్టికరిపించే అధునాతన విధ్వంసక వ్యవస్థలను ఇందులో అమర్చారు. ఈ సరికొత్త యుద్ధనౌకల చేరికతో భారత నౌకాదళ పోరాట సామర్థ్యం అసాధారణంగా పెరగనుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వ్యూహాత్మక హిందూ-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ ప్రాబల్యాన్ని, భద్రతను పటిష్టం చేసేందుకు ఈ నౌక ఎంతగానో దోహదపడనుంది.

ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదా? అయితే ఇలా చెయ్యండి !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha