CM Chandrababu Kuppam Tour:సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన జులై 2వ తేదీన జరగనుందని తెలుస్తోంది. పొగరుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మించిన పరిశ్రమలను ప్రారంభించడం ఈ టూర్ లో ప్రధాన అంశం.
స్థానిక ప్రజల అవసరాలు తీర్చడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ పర్యటన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
Read also: Hero Nani Tirumala Darshanam: శ్రీవారి సేవలో హీరో నాని
CM Chandrababu Kuppam visit
అధికారులతో సమీక్ష సమావేశాలు
పర్యటనలో భాగంగా కుప్పం అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించడంపై ఆయన ఫోకస్ పెడతారు. పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తారు.
CM Chandrababu Kuppam Tour:ప్రజలతో మమేకం బహిరంగ సభ
కుప్పంలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రజలను నేరుగా కలవనున్నారు సీఎం. సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకుంటారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేసే అవకాశం ఉంది. రాజకీయ అంశాల కంటే ప్రజా సమస్యలకే ఈ పర్యటనలో పెద్దపీట వేయనున్నారు. అధికారిక షెడ్యూల్ అతి త్వరలో వెలువడనుంది.
Epaper: epaper.vaartha.com

