Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

వార్త 1 week ago

Hyderabad fish prasadam 2026 : హైదరాబాద్‌లో ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే 'మృగశిర కార్తె చేప ప్రసాదం' పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి సమీక్ష మరియు భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రియాంక మరియు బత్తిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, క్యూ లైన్లు, తాగునీరు మరియు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షామియానాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

 Hyderabad fish prasadam 2026

శ్వాసకోశ వ్యాధులకు దివ్యౌషధం

దశాబ్దాలుగా బత్తిన గౌడ్ కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందని ప్రజల నమ్మకం. బతికున్న చిన్న చేప పిల్ల నోటిలో ప్రత్యేక మూలికా మిశ్రమాన్ని ఉంచి రోగుల చేత మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేసీఆర్‌పై కవిత సంచలన ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha