కేఎంసీలో ర్యాగింగ్ కలకలం
Kakatiya Medical College : వరంగల్లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ **కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)**లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను హాస్టల్ టెర్రస్పైకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కళాశాల అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు.
వాట్సాప్ మెసేజ్తో మొదలైన ఘర్షణ
ఈ ఘటనకు కారణం ఒక వాట్సాప్ గ్రూప్ మెసేజ్ అని సమాచారం. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థుల గురించి గ్రూప్లో తప్పుగా పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సీనియర్లు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులను టెర్రస్కు తీసుకెళ్లి క్షమాపణ చెప్పించారని తెలుస్తోంది.
Read Also : T20 : టీ20ల్లో 600 సిక్సులు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పిన బట్లర్
Kakatiya Medical Collegeఏడుగురు సీనియర్లపై కఠిన చర్య
జూనియర్ విద్యార్థుల ఫిర్యాదు మేరకు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై ఘటనపై విచారణ చేపట్టింది. ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించడంతో ఏడుగురు సీనియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

