Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరంలో వైభవంగా ప్రారంభమైన పుష్కరాలు

కాళేశ్వరంలో వైభవంగా ప్రారంభమైన పుష్కరాలు

వార్త 3 days ago

Kaleshwaram Saraswathi Pushkaralu 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే ఈ పుణ్యతీర్థం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశంలో ప్రయాగ్‌రాజ్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ త్రివేణి సంగమ తీరంలో మొదటి రోజే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

Read also: Kukatpally electric car accident: కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం.. టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన వైనం!

 Kaleshwaram Saraswathi Pushkaralu 2026

తొలి పుణ్యస్నానాలు ఆచరించిన ప్రముఖులు

పుష్కరాల ప్రారంభం సందర్భంగా కంచి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ ఉదయం 5:43 గంటలకు తొలి పుణ్యస్నానం ఆచరించారు. ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు కూడా పాల్గొని నదీ స్నానం చేశారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ విశేష ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి జనం భారీగా తరలివస్తున్నారు.

Kaleshwaram Saraswathi Pushkaralu 2026: భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

ఈ 12 రోజుల వేడుకలకు సుమారు 20 నుండి 30 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో మౌలిక వసతులు కల్పించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీరు, నీడ, వైద్య సేవలతో పాటు రవాణా సౌకర్యాలను కల్పించి భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha