Amilineni Surendra Babu: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచడంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇచ్చిందని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: మంత్రి లోకేశ్తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
పదో తరగతి విజేతలకు ఘన సన్మానం
సోమవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా కాలేజ్ బ్యాగులను అందజేస్తూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటడం గర్వకారణమని, ఇది ఉపాధ్యాయుల కృషి మరియు ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన కృషితోనే సాధ్యమైందని ఆయన అన్నారు.
Amilineni Surendra Babu: విద్యా ప్రమాణాల పెంపుకు ప్రభుత్వ చర్యలు
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్, నాణ్యమైన యూనిఫాంలు మరియు పుస్తకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఒకే కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ. 15 వేల చొప్పున అందజేస్తూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు.

నియోజకవర్గంలో విద్యా మౌలిక సదుపాయాల కల్పన
నారా లోకేష్ స్ఫూర్తితో కళ్యాణదుర్గం ప్రాంతంలో విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్సార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పాలవాయి పాఠశాలను రూ. 65 లక్షలతో పూర్తి చేశామని, శెట్టూరు ఉన్నత పాఠశాలకు రూ. 55 లక్షల విలువైన డెస్కులు అందించామని వివరించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ (KPL) నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోళ్ళ వెంకటేశులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

