Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి

Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి

వార్త

వార్త

54d

Loading...

ర్ణాటక (Karnataka) సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కు చెందిన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేయడంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. దీనికి వ్యాపార పరమైన కారణాలు ఉన్నాయని వెల్లడించారు. స్థానిక నటీమణులు ఇప్పటికే ఇతర బ్రాండ్లతో అనుబంధమై ఉన్నారని చెప్పారు. దీపికా పదుకొనే పేరును పరిశీలించినప్పటికీ, ఆమె డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా తీసుకోలేదన్నారు.

Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగపడతారు

మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటక (Karnataka) కే పరిమితం కాలేదు. తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8%, అంతర్జాతీయంగా 1% మార్కెట్ ఉంది. 2030 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం' అని మంత్రి తెలిపారు. తమన్నాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్, కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్ కు, బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Cyber Crime: కాంబోడియాలోని సైబర్ నేరగాళ్ల డెన్లపై మిలటరీ ఆపరేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha