Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా, బెయిల్‌ పిటిషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా, బెయిల్‌ పిటిషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

వార్త 2 days ago

Bandi Bhagirath case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు భగీరథ్‌ను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Read Also :Rangareddy crime: గర్భం దాల్చిన మైనర్ విద్యార్థిని.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు

అసలు ఏం జరిగిందంటే..?

 Petbasheerabad Police

బాధిత బాలిక తల్లి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు.. ఈ నెల 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావించిన పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టును ఆశ్రయించగా, ఆ విచారణ ప్రస్తుతానికి వాయిదా పడింది.

Bandi Bhagirath case: హైకోర్టులో భగీరథ్‌కు ఊరట

మరోవైపు, ఈ కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు ఉన్నత న్యాయస్థానంలో స్వల్ప ఉపశమనం లభించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ (Regular Bail) కొరకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు అతనికి అనుమతి మంజూరు చేసింది. దీనితో భగీరథ్ తరఫు న్యాయవాదులు త్వరలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha