Modi : న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల మండలి (Council of Ministers) అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించింది.
దాదాపు నాలుగున్నర గంటలకు పైగా సాగిన ఈ మారథాన్ భేటీలో క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, కీలక శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్డీయే (NDA) కూటమి కేంద్రంలో అధికారం చేపట్టి వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తికాబోతున్న తరుణంలో, ఈ సమావేశం ప్రభుత్వ పనితీరుపై ఒక అనధికారిక మధ్యంతర సమీక్షగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంత్రులకు చాలా స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇచ్చారు. “గతంలో ఏం జరిగిందో, సాధించిన విజయాలు ఏమిటో పక్కన పెట్టండి.. ఇకపై మన దృష్టి అంతా భవిష్యత్తు ప్రణాళికలపైనే ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ కూడా గత విజయాలను చూసి సంతృప్తి చెంది అలసత్వం వహించకూడదని గట్టిగా హెచ్చరించారు.
Read Also : ఇక లగేజ్ మోసేమోయాల్సిన పనిలేదు.. వినూత్న ఆలోచనతో స్టార్టప్
PM Modi cabinetవికసిత్ భారత్ 2047: కేవలం నినాదం కాదు, ఇది మన నిబద్ధత
ఈ కీలక సమావేశంలో ప్రధాని మోదీ ప్రధానంగా ‘వికసిత్ భారత్ 2047’ (Viksit Bharat 2047) లక్ష్యాన్ని నొక్కి చెప్పారు. భారతదేశాన్ని 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది కేవలం ఒక రాజకీయ నినాదం కాదని, అది దేశానికి తాము ఇచ్చిన నిబద్ధత (Commitment) అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు, వివిధ ప్రజా సంక్షేమ పథకాలు కేవలం ఫైళ్లకు, సెక్రటేరియట్ టేబుళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఏ ఫైలు కూడా అనవసరంగా జాప్యం కాకూడదని, పరిపాలనలో సరళత్వాన్ని తీసుకురావాలని సూచించారు. దాదాపు 9 కీలక మంత్రిత్వ శాఖల ప్రజెంటేషన్లను పరిశీలించిన ప్రధాని, అంతర్జాతీయంగా పశ్చిమ ఆసియా (West Asia) సంక్షోభం కారణంగా వస్తున్న చమురు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే.. దేశీయంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు (Ease of Living) ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్

