Dailyhunt
కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి!

కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి!

వార్త 5 days ago

Para Boiled Rice Procurement: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఇందులో భాగంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో వారు కీలక భేటీ నిర్వహించారు.

రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, ధాన్యం సేకరణ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

Read Also: Telangana Traffic Rules: ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్నారా? హెల్మెట్ లేకపోతే ఇక నో ఎంట్రీ!

Para Boiled Rice Procurement: ధాన్యం సేకరణపై కీలక విజ్ఞప్తి

రాష్ట్రంలో పండే వానాకాలం, యాసంగి పంటలకు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా వచ్చే 2025-26 సీజన్‌కు సంబంధించి యాసంగి పంట దిగుబడి సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉండబోతోందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ భారీ దిగుబడిని దృష్టిలో ఉంచుకుని, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని విన్నవించారు.

పెండింగ్ నిధుల విడుదలపై చర్చ

కేంద్ర పౌరసరఫరాల శాఖ నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ఈ భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెచ్చించిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వాటా మరియు ఇతర బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, రైతులకు సకాలంలో చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha