Kerala CM Post Suspense: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గానూ 102 సీట్లు గెలుచుకుని యూడీఎఫ్ (UDF) స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ అధిష్ఠానానికి సవాలుగా మారింది.
శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగియడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
Read Also:Tamilnadu Politics : DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !
ముగ్గురు కీలక నేతలు.. రేసులో ముందంజ
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు హేమాహేమీలు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
- వీడీ సతీశన్: ప్రస్తుతం గట్టి పోటీదారుగా ఉన్నారు.
- కేసీ వేణుగోపాల్: ఏఐసీసీలో కీలక నేతగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లోనూ పట్టు కలిగి ఉన్నారు.
- రమేశ్ చెన్నితల: సీనియర్ నేతగా తనదైన శైలిలో రేసులో ఉన్నారు.
UDF Victory Kerala 2026
Kerala CM Post Suspense: హైకమాండ్ భేటీలో తేలని నిర్ణయం
మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ సేకరించిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఈ సమావేశంలో చర్చించారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ వెల్లడించారు. త్వరలోనే తుది నిర్ణయాన్ని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటిస్తారని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో, పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని అధిష్ఠానం విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి చూపు కేరళపైనే ఉంది. మరోసారి సమావేశమై తుది పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

