Kerala Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కింది. ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తన ఎన్నికల మేనిఫెస్టోను ఘనంగా విడుదల చేసింది.
కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ తో కలిసి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన తీరును వీడీ సతీషన్ కొనియాడారు. కేరళలో కూడా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే వేగంతో హామీలను నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ‘పుతు యుగ యాత్ర’ ముగింపులో ప్రకటించిన ఐదు ప్రధాన గ్యారెంటీల ఆధారంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు.
Read Also: Iran Representative: ఇండియాపై ప్రశంసలు కురిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి
Kerala Elections 2026: మేనిఫెస్టోలోని టాప్ 10 హామీలు
ఈ అయిదు హామీలలో మహిళలకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్లలో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థినులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందించడం, దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పేరుతో రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, సంక్షేమ పెన్షన్లు రూ. 3,000కు పెంపు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రభుత్వ విభాగం ఏర్పాటు వంటివి ప్రధానమైనవి.
మేనిఫెస్టో సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, వ్యవసాయ సంస్కరణలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అర్హులైన లబ్ధిదారులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చట్టాన్ని తీసుకువస్తామని, ఆకలి రహిత కేరళగా రాష్ట్రాన్ని దీర్చిదిద్దే క్రమంలో ఇందిరా క్యాంటీన్లను విస్తరిస్తామని కూడా యూడీఎఫ్ ప్రకటించింది. ప్రత్యేక పరిస్థితులు, ప్రాంతాలలో అర్హులైన వర్గాలకు ఉచిత రేషన్ మద్దతు అందిస్తారు. పేదరిక నిర్మూలనకు ఆశ్రయ పథకం రెండవ దశలో నవ ఆశ్రయను అమలు చేస్తామని యూడీఎఫ్ తెలిపింది.
CM Revanth Reddy launches Kerala UDF manifesto
విద్యాసంస్థల్లో భద్రత – సిద్ధార్థన్ యాక్ట్
వాయనాడ్ వెటర్నరీ కళాశాల విద్యార్థి సిద్ధార్థన్ ర్యాగింగ్ కారణంగా మరణించిన ఘటన కేరళను కుదిపేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల రక్షణ కోసం యూడీఎఫ్ కీలక ప్రతిపాదనలు చేసింది.విద్యాసంస్థల్లో ర్యాగింగ్ను అరికట్టడానికి మరియు విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నారు.విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తక్షణమే ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ను ప్రవేశపెడతారు.
వ్యవసాయ రంగానికి ఊతం
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యూడీఎఫ్ విప్లవాత్మక మార్పులను సూచించింది.వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.రబ్బర్కు రూ. 300 మద్దతు ధర కల్పిస్తారు. అలాగే కొబ్బరి మద్దతు ధర పెంపు, కొనుగోలు కేంద్రాల విస్తరణ ఉంటుంది.ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలను (MSP) అమలు చేస్తామని స్పష్టం చేశారు.
యువత, మహిళా సాధికారత
ప్రణాళికా వ్యయంలో 5 శాతం నిధులను యువత కోసం కేటాయిస్తారు. కుటుంబశ్రీ తరహాలో ‘యువశ్రీ’ కలెక్టివ్లను ఏర్పాటు చేస్తారు.ఆశా వర్కర్ల వేతనం రూ. 700కి పెంపుతో పాటు, అంగన్వాడీ మరియు పాఠశాల వంట మనుషుల వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు.
వన్యప్రాణి సంఘర్షణల నియంత్రణకు AI
కేరళలో మానవ-వన్యప్రాణి సంఘర్షణలు పెద్ద సమస్యగా మారాయి. దీని కోసం ఆధునిక సాంకేతికతను వాడనున్నారు.డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐఓటీ (IoT) ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.వన్యప్రాణుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 50 శాతం పెంచుతారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

