Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ ఆందోళన.. నాలుగేళ్ల చిన్నారి మృతి

కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ ఆందోళన.. నాలుగేళ్ల చిన్నారి మృతి

వార్త 5 days ago

Kerala shigella infection: కేరళ రాష్ట్రంలో షిగెల్లా ఇన్ఫెక్షన్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకడంతో నాలుగేళ్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాదం మరవకముందే, తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరికి షిగెల్లా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Read also: Chennai Crime: ప్రియుడితో కలిసి భర్త చంపి.. ఆపై ఏం చేసిందంటే?

 Concern over Shigella infection in Kerala: 4-year-old child dies, two others infected.

Kerala shigella infection: విద్యార్థుల అనారోగ్యంపై మంత్రి వివరణ

వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, అప్రమత్తమైంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుండటంతో, నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

మరోవైపు, రాష్ట్రంలోని పలువురు విద్యార్థులు విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరడం స్థానికంగా మరింత ఆందోళనకు దారితీసింది. అయితే, ఈ విషయంపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి మురళీధరన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు సాధారణ ఇన్ఫెక్షన్లే వచ్చాయని, వారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకలేదని ఆయన అధికారికంగా వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

కేంద్రానికి SBI రూ.8,813 కోట్ల డివిడెండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha