Dailyhunt
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

వార్త 1 week ago

Election Updates: కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా మొదలైంది. ఓటు వేయడానికి ప్రజలు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు వృద్ధులు, యువకులు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

Read also: Yanam Elections 2026: యానాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ

Voters standing in queue at polling station.

Election Updates: రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

ఉదయం 9 గంటల సమయానికి కేరళలో 16.23 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో మొదటి రెండు గంటల్లోనే 17.87 శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో కూడా ఓటర్లు ఉత్సాహం చూపిస్తుండటంతో అక్కడ 17.41 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కలను చూస్తుంటే ఈసారి భారీగా ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఉప ఎన్నికల సందడి

కర్ణాటకలోని బాగల్ కోట్ మరియు దావణగెరె సౌత్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బాగల్ కోట్ లో ఉదయం 9 గంటల వరకు 11.87 శాతం పోలింగ్ నమోదు కాగా, దావణగెరె సౌత్ లో 9 శాతం ఓటింగ్ జరిగింది. అటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ లో 19.80 శాతం, త్రిపురలో 15.63 శాతం ఓటింగ్ నమోదు కావడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విమాన టిక్కెట్ల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha